Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. ! సమావేశానికి వైసీపీ దూరం ...!

28 Mar 2026
01:54 PM
13

Astra web desk  : 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వేదికగా మారింది. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై కీలక తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు.

ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. సభ ఆమోదం పొందిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇక సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు స్థిరమైన రాజధాని నిర్మాణం అత్యంత అవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లక్ష్యంతో కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విధానాలు మారకూడదని, రాష్ట్ర అభివృద్ధికి స్థిరత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ప్రత్యేక సమావేశానికి ప్రతిపక్ష వైసీపీ మాత్రం హజరుకాలేదు. ఈ సమావేశ ప్రస్తావన వచ్చిన వెంటనే వైసీపీ స్పందిస్తూ...తాము  అమరావతికి వ్యతిరేకం కాదని, తమ వికేంద్రీకరణలోను అమరావతికి ప్రత్యేక స్థానం ఇచ్చామని, అసెంబ్లీతో పాటు మండలిని కూడా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!