Thursday, 28 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కూటమి వైఫల్యాలపై ఇక సమరమే... ! కూటమికి వైఎస్ జగన్ హెచ్చరిక ....!!

27 May 2026
03:04 PM
19

* చంద్ర‌బాబు వెన్నుపోటుకు రెండేళ్లు ... బుక్‌లెట్‌ ఆవిష్క‌ర‌ణ‌..
* "ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు ఈ బుక్‌లెట్‌ రిలీజ్ ...
 * జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు...గ్రామ స్థాయి నుంచి విస్తుృతంగా నిరసన కార్య‌క్ర‌మాలకు పిలుపు....


తాడేపల్లి     : 
ఏపీలో కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, చంద్రబాబు 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో బుక్ విడుదల చేశారు. ఇందులో భాగంగా జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్స్ పి నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది కూడా చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలిలే ఉండాలన్నారు. 

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశు జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...'చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. అడబిడ్డ విధికి నిధుల్లేవు. 

18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది, మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ! తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో కేవలం అవినీతి, ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం కూడా 3.22% తగ్గిందని గణాంకాలను ప్రస్తావించారు. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు. గొడ్డళ్లు కత్తులు, కటార్లంటూ కొత్త డ్రైవర్షన్ తీసుకోచ్చాడు. ప్రజలను పిచ్చోళ్లుని చంద్రబాబు అనుకుంటున్నాడు.  కానీ, ప్రజలు తెలివైన వాళ్లని గుర్తించాలి' అని చెప్పుకొచ్చారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!