Thursday, 28 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాల్సిందే ...!

27 May 2026
03:16 PM
102

* పార్టీ  నేతలకు వైఎస్ జగన్ అల్టిమేటమ్ ...!
* స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థికి అన్ని విధాలుగా తోడుగా ఉండాలి ....
* చంద్ర‌బాబు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డినా..కార్య‌క‌ర్త‌లకు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు అండ‌గా నిల‌బ‌డాలి...

 

తాడేపల్లి   : 
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని పార్టీ నేతలకు జగన్ అల్టిమేటమ్ ఇచ్చారు. 

వైఎస్సార్సపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..'చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని చౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.
 

చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీవేసి మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే అభ్యర్ధి తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ ధైర్యం కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు రేపు జనరల్ ఎన్నికల్లో అండగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్డ్ గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవడు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో. ఇప్పటికి మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.
అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.

స్థానిక ఎన్నికల సమయం వచ్చే పరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతి ఇంటికి వేరేలా చూడాలి, చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు' అని అన్నారు. 

 

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!