Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / క్రీడలు

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు షాక్... !

12 Jul 2026
12:40 AM
18

* ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 4-0తో సిరీస్ కైవసం...

India vs England  :
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. శనివారం జరిగిన ఐదో టీ20లో కూడా భారత్ 56 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, సిరీస్‌ను 4-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయాన్ని అందుకోలేక వైట్‌వాష్‌ను ఎదుర్కొంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 64 బంతుల్లో 131 పరుగులు చేసి అద్భుత శతకం నమోదు చేశాడు. హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 95 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్ 56, తిలక్ వర్మ 53 పరుగులతో పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. సంజు శాంసన్ (27), శ్రేయస్ అయ్యర్ (28), శివమ్ దూబె (14) ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, లియామ్ డాసన్ తలో వికెట్ సాధించారు.
ప్రపంచకప్ అనంతరం వరుసగా రెండో టీ20 సిరీస్‌లోనూ భారత్ వైట్‌వాష్‌ను ఎదుర్కొనడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన విషయం తెలిసిందే.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!