Wednesday, 29 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టీచర్లలో టెట్ టెన్షన్ ....!

20 Jul 2026
03:30 PM
148

* 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు కల్పించండి...
* TET ఉత్తీర్ణత సాధించాలనడం అనవసరమైన ఇబ్బందులు, అనిశ్చితిని కలిగిస్తుంది ..
* రాష్ర్ట వ్యాప్తంగా ఉపాధ్యాయుల వినతులు....

Astranews  : 

ఎపిలో ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ కొనసాగుతుంది. ఇటీవల కేంద్రం ఉద్యోగాల్లో నియమితులై  సేవల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పని సరి చెయ్యడంపై ఇప్పటికే అనేక మార్లు తమ నిరసనను. వ్యతిరేకతను వ్యక్తం చెయ్యగా... సోమవారం రాష్ర్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ వినతులను అధికారులకు అందజేశారు. 

2011కు ముందు నియమితులై ప్రస్తుతం సేవలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నుండి మినహాయింపు కల్పించవలసిందిగా ప్రభుత్వానికి సిఫారసు కలెక్టర్లకు  వినతి పత్రాలను సమర్పించారు.

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాల నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశంతో TETను ప్రవేశపెట్టింది. అయితే, 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు అప్పట్లో అమలులో ఉన్న నియామక నిబంధనలు, విద్యార్హతలు మరియు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకమైన DSC ఎంపిక ప్రక్రియ ద్వారా నియమించబడ్డారు. అంతేకాకుండా వారు అనేక సంవత్సరాలుగా సమర్థవంతమైన బోధన, తరగతి గది పనితీరు, శాఖాపరమైన తనిఖీలు, పనితీరు మూల్యాంకనాలు, ప్రొబేషన్ పూర్తి చేయడం మరియు నిరంతర వృత్తిాభివృద్ధి ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

సేవలో ఉన్న కాలంలోను ప్రభుత్వం నిర్వహించిన DIKSHA, NISHTHA, FLN, TARL వంటి అనేక ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. బోధనా పద్ధతులు, పాఠ్యాంశ సంస్కరణలు, డిజిటల్ విద్య, సమగ్ర మూల్యాంకనం, సమగ్ర విద్య తదితర అంశాలలో ఈ శిక్షణలు ఉపాధ్యాయుల నైపుణ్యాలను గణనీయంగా అభివృద్ధి చేశాయి. వీరిలో అనేక మంది ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల నుండి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు. విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం నుండి ప్రశంసలు పొందారు. ఈ గుర్తింపులే వారి బోధనా సామర్థ్యానికి నిదర్శనం. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా సమర్థవంతంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఈ దశలో TET ఉత్తీర్ణత సాధించమని కోరడం అనవసరమైన ఇబ్బందులు, అనిశ్చితిని కలిగిస్తుంది. అనుభవం, నిరంతర మూల్యాంకనం ద్వారా ఇప్పటికే నిరూపితమైన బోధనా సామర్థ్యాన్ని ఇది మరింత పెంచదు. 

అందువల్లే 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడం ద్వారా న్యాయం, సముచిత పరిపాలన, సహజ న్యాయ సూత్రాలు, ఇప్పటికే సంపాదించిన సేవా హక్కుల పరిరక్షణ వంటి అంశాలు కాపాడబడటమే కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వారు చేసిన అమూల్యమైన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాల సంతృప్తికర సేవ, ప్రభుత్వం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల విజయవంతమైన పూర్తి, పనితీరు మూల్యాంకనాలు,  వృత్తిపరమైన విజయాలను బోధనా సామర్థ్యానికి తగిన ఆధారాలుగా పరిగణించాలి. TET అర్హతను తప్పనిసరి చేయకుండా వారి సేవా హక్కులు, పదోన్నతులు మరియు వృత్తి పురోగతిని రక్షించే అవసరమైన ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. అంటూ రాష్ర్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులు అయా జిల్లా కలెక్టరేట్లలోని గ్రీవెన్ సెల్ కార్యక్రమాల్లో తమ వినతులను అందజేశారు. 

కడపలో  ఈ మేరకు YSRTA జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు రమణా రెడ్డి, జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి  , కృపా ప్రేమ్ సాగర్  తదితరులు పాల్గొని 
జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 

 

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!